Tuesday, April 29, 2025

మెదక్ జిల్లాలో ప్రమాదం: దంపతులు మృతి

- Advertisement -
- Advertisement -

కౌడిపల్లి : మెదక్ జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కౌడిపల్లి మండలం మహ్మద్ నగర్ స్టేజీ వద్ద ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో దంపతులు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News