Tuesday, September 17, 2024

విధి రాతను మార్చలేకపోయింది.. చివరికి…

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా బుధవారం విషాదం చోటుచేసుకుంది. బస్సు మారినా ఓ మహిళ తన విధి రాతను మార్చలేకపోయింది. ప్రకాశం జిల్లాలో మానస అనే మహిళ తొలుత ఆర్టీసీ బస్సు ఎక్కింది. ఆ బస్సుకు ప్రమాదం జరిగింది. ప్రమాద ఘటన అనంతరం మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కి గమ్యస్థానం చేరుకోవాలని చూసింది. కానీ ఆ బస్సుకు కూడా రోడ్డు ప్రమాదానికి గురికావడంతో మృతి చెందింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News