Thursday, April 24, 2025

శంషాబాద్ ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. మహిళ స్పాట్ డెడ్

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం వద్ద ఓఆర్ఆర్ పై శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చి కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాల య్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు,

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News