Saturday, October 5, 2024

రోహిత్, గిల్ ఔట్

- Advertisement -
- Advertisement -

కొలొంబో: ఆసియా కప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా 24.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 147 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ, శుభమన్ గిల్ హాఫ్ సెంచరీలు చేసి వరుస ఓవర్లలో ఔటయ్యారు. ఓపెనర్లు 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ(8), కెఎల్ రాహుల్(17) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రిదీ, షాదాబ్ ఖాన్ చెరో ఒక వికెట్ తీశారు. ఆట మధ్యలో వర్షం కురవడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News