- Advertisement -
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో ఐపిఎల్లో భాగంగా గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ మూడు ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 30 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ ఎనిమిది పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. ప్రస్తుతం రియన్ రికెల్టన్(5), తిలక్ వర్మ(17) బ్యాటింగ్ చేస్తున్నారు. అంతకు ముందు బ్యాటింగ్ చేసి గుజరాత్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాట్స్ మెన్లలో సాయి సుదర్శన్(63), శుభ్మన్ గిల్(38), జోస్ బట్లర్(39) పరుగులు చేశారు. మిగిలిన బ్యాట్స్మెన్లు స్వల్ప స్కోర్కే వెనుదిరిగారు.
- Advertisement -