- Advertisement -
హైదరాబాద్: నగరంలోని సరూర్నగర్ పిఅండ్టి కాలనీలో రౌడీషీటర్ హత్యకు గురైయ్యాడు. బుధవారం అర్థరాత్రి రౌడీషటర్ వినయ్ పై పాత నేరస్థులు కత్తితో దాడిచేసి చంపేశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. నగదు, సెల్ ఫోన్ విషయంలో వివాదమే ఈ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. గౌలిగూడకు చెందిన వినయ్ పై ఛత్రినాక పోలీస్ స్టేషన్ లో రౌడీషీట్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ హత్య నిందితులు సంతోష్ నగర్ కు చెందిన అన్నదమ్ములు సందీప్, సంతోష్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
Rowdy Sheeter Brutally Murdered in saroornagar
- Advertisement -