- Advertisement -
హైదరాబాద్: ఓల్డ్ సిటీలో దారుణ హత్య జరిగింది ఫలక్నుమా పరిధిలోని రెయిన్ బజార్లో రౌడీషీటర్ మాస్ యుద్ధీన్పై కొందరు గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.
ఈ హత్యకు సంబంధించిన వివరాలను స్థానికుల నుంచి సేకరించిన పోలీసులు.. ప్రత్యర్థులే యుద్ధీన్ను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మూడు రోజుల క్రితమే మాస్ యుద్ధీన్కి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -