Monday, March 10, 2025

ఎస్వీబీసీ ట్రస్ట్ కు రూ.11 లక్షల విరాళం

- Advertisement -
- Advertisement -

Rs 11 lakh donation to SVBC Trust

తిరుపతి: శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్ట్ కు గురువారం రూ. 11 లక్షల విరాళాలు అందాయి. ఢిల్లీకి చెందిన రమా ఇండియా లిమిటెడ్ నిర్మాణ సంస్థ రూ 10 లక్షలు, బెంగళూరుకు చెందిన నాగదీపక్ రూ 1 లక్ష విరాళంగా అందించారు. తిరుపతికి చెందిన తమ ప్రతినిధి వై.రాఘవేంద్ర ద్వారా డి.డి.లను ఎస్వీబీసీ కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డికి అందించారు. అదనపు ఈవో, ఎస్వీబీసీ ఎండి శ్రీ ధర్మారెడ్డి, ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్ కుమార్ పాల్గొన్నారు. టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే ఈ ప్రకటన విడుదల చేయడమైనది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News