Tuesday, September 17, 2024

రూ. 175కోట్ల భారీ సైబర్ క్రైమ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ కేం ద్రంగా భారీగా సైబర్ క్రైమ్ కుంభకోణం పాల్పడిన ట్లు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ నేర గాళ్లకు సహకరించిన ఇద్దరు బ్యాంకు నుంచి రూ. 175 కోట్లు లావాదేవీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో. ఎన్‌సిఆర్ పి పోర్టల్‌లో డేటా విశ్లేషించగా పాతబస్తీలోని షం షీర్‌గంజ్ ఎస్‌బిఐ శాఖలోని ఆరు బ్యాంకు ఖాతాల ఫిర్యాదులను గుర్తించింది. ఈ ఖాతాల ద్వారా రెం డు నెలల స్వల్ప వ్యవధిలో పెద్ద మొత్తంలో డబ్బు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఖాతాదారు లు పెద్ద ఎత్తున సైబర్ మోసాలకు పాల్పడి అవక తవకలకు పాల్పడినట్టు గుర్తించారు. ఈ ఖాతాలకు దాదాపు 600 ఫిర్యాదులు లింక్ గుర్తించారు. ప్రధాన నిందితుడు దుబాయ్ కేంద్రంగా పనిచేస్తు న్నట్లు గుర్తించారు. అతనికి చెందిన ఐదుగురు స హచరులు పేద ప్రజలను బ్యాంకు ఖాతాలు తెరి చేందుకు, సైబర్ నేరాలు, హవాలా కార్యకలాపా లకు కమీషన్ ప్రాతిపదికన ఉపయోగించుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

బ్యాంకు ఖాతాలు తెరవ డంలో అవసరమైన అన్ని పత్రాలను సిద్ధం చేయ డంలో మహమ్మద్ షోయబ్ తౌకీర్ అనే వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ధా రించారు. ఖాతాలు తెరిచిన తర్వాత, చెక్కులపై ఖా తాదారుల సంతకాలు చేయించాడు. ఆపై వాటిని సహచరులలో ఒకరి కస్టడీలో ఉంచారు. కొంత డబ్బును క్రిప్టో కరెన్సీ ద్వారా దుబాయ్‌కి పంపిం చారు. ప్రధాన నిందితుడి ఆదేశాలను అనుసరించి సహచరులు డబ్బును విత్ డ్రా చేశారు. షోయబ్ తోపాటు ఇతర సహచరులు కొంతమంది పేద వ్య క్తులను ఫిబ్రవరి 2024లో ఎస్‌బిఐ షంషీర్‌గంజ్ బ్రాంచ్‌లో ఆరు కరెంట్ ఖాతాలను తెరిచేందుకు ఒప్పించి, కమీషన్‌లతో ఆశ చూపించారు. ఈ ఏడా ది మార్చి, ఏప్రిల్ నెలలో, ఈ ఆరు ఖాతాలలో రూ. 175 కోట్లు లావాదేవీలు సైబర్ పోలీసులు గుర్తిం చారు. సైబర్ నేరగాల కోసం పనిచేసిన మహ్మద్ షోయబ్ తౌకీర్, మహ్మద్ బిన్ అహ్మద్ బవాజీర్ లను సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అదుపు లోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇలాంటి మో సాలపై ప్రజలు అప్రమత్తం గా ఉండాలని సూచిస్తు న్నారు పోలీసులు.

వేరొకరి కోసం బ్యాంకు ఖాతా తెరవ వద్దని, అనుమానాస్పద లావాదేవీలలో పాల్గొనవద్దని హెచ్చరిస్తున్నారు. బ్యాంకు ఖాతాలను తెరవడానికి అయాచిత ఆఫర్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఖాతాను తెరవమని, ఖాతా కార్యకలాపాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించమని పోలీసులు సూచిస్తున్నారు. పెరిగిన టెక్నాలజీని ఆసరాగా చేసుకుని ఇటీవల సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. ఓటీపీ, లింక్ ల పేరుతో క్షణాల్లోనే కోట్ల రూపాయలు కొల్లగొడు తున్నారు. ఇలాంటి వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News