రూ.64వేల కోట్లతో
26 యుద్ధ విమానాల
కొనుగోలుకు సిసిఎస్
ఆమోదం ప్రధాని మోడీ
అధ్యక్షతన సమావేశం
తిరుపతి కాట్పాడి మధ్య
డబ్లింగ్కు కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్పై మోహరించేందుకు సుమారు రూ.64 వేలకోట్ల వ్యయంతో ఫ్రాన్స్ నుం చి 26 నౌకాదళ వేరియంట్ల రఫేల్ ఫైటర్ జెట్ల కొనుగోలు ప్రతిపాదనకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో భద్రతపై కేబినెట్ కమిటీ(సిసిఎస్) ఆమోదముద్ర వేసినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. భార త్, ఫ్రాన్స్ మధ్య అంతర్ ప్రభుత్వ యం త్రాంగం కింద కాంట్రాక్ట్పై సంతకాల అనంతరం సుమారు ఐదు సంవత్సరాల్లో జెట్ల సరఫరా మొదలవుతుంది. వరుస సంప్రదింపులు, ప్లాట్ఫారమ్ మదింపు పరీక్షల దరిమిలా 2023 జూలైలో రక్ష ణ మంత్రత్వశాఖ భారీ స్థాయిలో రఫాలె జెట్ల కొనుగోలుకు ప్రాథమికంగా ఆమో దం తెలిపింది. ఆ ఒప్పందం కింద, భారతీయ నౌకాదళం రఫేల్(మెరైన్) జెట్ల ఉత్పత్తి సంస్థ దసాల్స్ ఏవియేషన్ నుంచి
ఆయుధ వ్యవస్థలు, విడిభాగాలు సహా అనుబంధ పరికరాలను కూడా పొందుతుంది. భారతీయ వైమానిక దళం (ఐఎఎఫ్)గగనయానస్థితిలో 36 రఫాలె యు ద్ధ విమానాలను కొనుగోలు చేసింది. కనీ సం మరి రెండు రఫేల్ జెట్ల స్కాడ్రన్లు కొనుగోలు చేయాలని కూడా ఐఎఎఫ్ యోచిస్తోంది. భారత్, ఫ్రాన్స్ మధ్య రక్ష ణ, వ్యూహాత్మక సంబంధాలు కొన్ని సం వత్సరాలుగా వృద్ధి చెందుతున్నాయి. భా రత నౌకాదళం బలాన్ని మరింతపెంచేందుకు మూడు స్కార్పీన్ జలాంతర్గాముల కొనుగోలుకు కూడా రక్షణ మం త్రిత్వశాఖసుమారు రెండేళ్ల క్రితం ఒకప్రతిపాదనను ఆమోదించింది. సిసిఎస్ ఆ ప్రాజెక్టుకు ఇంకా ఆమోద ముద్ర వేయలసి ఉంది.తిరుపతి,పాకాలకాట్పాడి మధ్య డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమో దం తెలిపింది. దీని కోసం రూ.1332 కోట్లు ఖర్చు కాగలదని అంచనా.