Sunday, February 23, 2025

బహదూర్‌పురాలో రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆర్టిసి బస్సు ఆటోను ఢీకొట్టడంతో నలుగురు ప్రయాణికులకు గాయాలైన సంఘటన బహదూర్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…పాతబస్తీ బహుదూర్‌పురా క్రాస్ రోడ్డు వద్ద ఆటో వెళ్తుండగా ఆర్టిసి బస్సు వెనుక నుంచి వస్తోంది. బస్సు బ్రేకులు ఫేయిల్ కావడంతో ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టిసి బస్సు బ్రేకుల పేయిల్ కావడంతో ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News