Tuesday, March 4, 2025

రష్యా తొలిసారి ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది: కీవ్

- Advertisement -
- Advertisement -

ఉక్రెయిన్‌పై ఉదయం చేసిన దాడిలో రష్యా తన దక్షిణ ఆస్ట్రాఖాన్ ప్రాంతం నుండి ఖండాంతర క్షిపణిని ప్రయోగించిందని కీవ్ వైమానిక దళం తెలిపింది. యుద్ధం మొదలైన తర్వాత రష్యా ఇంత సుదూర, శక్తివంతమైన క్షిపణిని ఉపయోగించడం ఇదే తొలిసారి అని ఉక్రెయిన్ పేర్కొంది.

జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఉక్రెయిన్‌కు యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్‌ల ఏర్పాటును ఆమోదించిన తర్వాత, వ్లోదిమీర్ జెలెన్స్కీ ఒక వీడియోలో యుఎస్‌కి కృతజ్ఞతలు తెలిపారు, ల్యాండ్‌మైన్‌లు “రష్యన్ దాడులను ఆపడానికి… అత్యవసరం…” అని ‘ది గార్డియన్’ నివేదించింది. అంతకుముందు, యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ మాట్లాడుతూ, మారుతున్న రష్యా వ్యూహాలను ఎదుర్కోవడానికి ఉక్రెయిన్ కోసం యాంటీ పర్సనల్ ల్యాండ్‌మైన్‌లపై వాషింగ్టన్ విధానంలో మార్పు అవసరమని అన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News