Sunday, September 22, 2024

రైతులందరికీ రైతుబంధు: సిఎస్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు పథకం అందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. బిఆర్‌కెఆర్ భవన్‌లో గురువారం అధికారులతో ఆయన రైతుబంధు పంపిణీపై సమీక్షించారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ఎటువంటి జాప్యం లేకుండా రైతులందరికీ వారి బ్యాంకు ఖాతాలలో డబ్బు జమ అయ్యేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె. రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాస్, భూపరిపాలన శాఖ డైరెక్టర్ రజత్ కుమార్ షైనీ పాల్గొన్నారు.

Rythu bandhu cash gives to all Farmers: Somesh Kumar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News