Wednesday, October 16, 2024

కెసిఆర్‌ను విమర్శించడమే మీ విధానమా..?: సబితా ఇంద్రారెడ్డి

- Advertisement -
- Advertisement -

విద్యార్థుల ముందు, గురువుల ముందు కెసిఆర్‌ను విమర్శించడమే మీ విధానమా..? అంటూ సిఎం రేవంత్‌రెడ్డిని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. గడిచిన పది నెలలలో కెసిఆర్ పేరు ఎత్తకుండా ఒక్క సభలో అయినా మాట్లాడారా..? అని అడిగారు. మాట్లాడేటప్పుడు అది ప్రభుత్వ కార్యక్రమమా లేక పార్టీ కార్యక్రమమా అని ముఖ్యమంత్రి మర్చిపోతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చాం అని చెప్తున్న టీచర్ పోస్టులు కెసిఆర్ మంజూరు చేసినవి కావా.. హైయర్ ఎడ్యుకేషన్‌లో 3202 పోస్టులు, యూనివర్సిటీలో 1081 పోస్టులు కెసిఆర్ ప్రభుత్వం మంజూరు చేసినవి కావా..? అని నిలదీశారు. ఇంటర్, టెక్నికల్, కాలేజియేట్ ఎడ్యుకేషన్ సంబంధించి 3896 కాంట్రాక్టు ఉద్యోగులను కెసిఆర్ రెగ్యులర్ చేశారు అని చెబితే బాగుండేదని అన్నారు.

ఎన్నికల ముందు మీరు చెప్పిన 25,000 టీచర్ పోస్టులు ఎందుకు ఇవ్వలేదని, ఆ గురువుల ముందు చెప్తే బాగుండేదని, ఎన్నికలప్పుడు 6000 పాఠశాలలు మూతపడ్డాయి అని అబద్దం చెప్పిన మీరు, ఆ పాఠశాలల లిస్ట్ విడుదల చేస్తే బాగుండేదని, ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం ఎందుకు ఆపేసారో చెప్తే బాగుండేదని..6 లక్షల మంది పేద విద్యార్థులు చదువుతున్న కెసిఆర్ ప్రవేశపెట్టిన గురుకులాలను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేద్దాం అనుకుంటున్నదని చెప్తే బాగుండేదని, ప్రభుత్వ పాఠశాలలో ‘బ్రేక్ ఫాస్ట్ స్కీమ్’ ఎందుకు ఆపేశారో చెప్తే బాగుండేదని, ఎన్నికల సమయంలో చెప్పినట్టు ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్య భరోసా కార్డు ఎప్పుడు ఇస్తారో చెప్తే బాగుండేదని సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి పేర్కొన్నారు. 19 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మిగతా పాఠశాలలను గాలికి వదిలేశాము అని చెప్తే బాగుండేదని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News