Wednesday, July 3, 2024

మేడిగడ్డ.. ఇసుక అడ్డా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఇసుక కొరత రా కుండా టిజిఎండిసి చర్యలు చేపడుతోంది. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని రీచ్‌లలో ఇ సుకను అందుబాటులో ఉంచుతుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 59,89,380 మెట్రిక్ టన్నుల ఇసుక అం దుబాటులో ఉండగా దీనికితోడు మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద ఇసుకను కూడా వేలం వేయాలని టిజిఎండిసి ని ర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 100కు పైగా ఇసుకరీచ్‌లు ఉండగా ఆయా రీచ్‌లలో 59 లక్షల మెట్రిక్ టన్నుల పైచిలుకు ఇసుక లభ్యం అవుతోంది. ఈ నేపథ్యంలోనే కొత్తగా కాళేశ్వరంలోని మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద సుమారుగా 92 లక్షల పైచిలుకు మె ట్రిక్ టన్నుల ఇసుక (14 బ్లాక్‌ల్లో) అందుబాటులో ఉండడంతో వాటికి టిజిఎండిసి అధికారులు ఈ వేలం నిర్వహిస్తున్నారు. నేటితో ఆ టెండర్‌ల ప్ర క్రియ కూడా పూర్తికానుందని త్వరలో టెండర్‌లను ఖరారు చేసి కాంట్రాక్టర్‌లకు రీచ్‌లను అప్పగిస్తామని అధికారులు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ కుడివైపున మహదేవ్‌పూర్ మండలంలో సూరారం నుంచి కుం ట్లుం గ్రామ పరిధిలోని బెగ్లూర్‌లోని

బ్రాహ్మణపల్లిలో ని బ్లాక్‌లో (15,52,923 మెట్రిక్ టన్నుల ఇసుక), ఎల్కేశ్వరంలోని బ్రాహ్మణపల్లి బ్లాక్‌లో (5,98,030 మెట్రిక్ టన్నుల ఇసుక), ఎల్కేశ్వరంలోని మహదేవపూర్ బ్లాక్‌లో (5,98,030 మెట్రిక్ టన్నుల ఇసుక), బొమ్మాపూర్ మహదేవపూర్ బ్లాక్‌లో (3,62,735 మెట్రిక్ టన్నుల ఇసుక), బొమ్మాపూర్ మహదేవపూ ర్ బ్లాక్‌లో (3,62,735 మెట్రిక్ టన్నుల ఇసుక), బొ మ్మాపూర్ మహదేవపూర్ బ్లాక్‌లో (3,62,735 మె ట్రిక్ టన్నుల ఇసుక),బొమ్మాపూర్ మహదేవపూర్ బ్లాక్‌లో (3,62,735 మెట్రిక్ టన్నుల ఇసుక)కు ఈ ప్రొక్యూర్‌మెంట్ ద్వారా వేలం నిర్వహిస్తున్నారు. దీనిద్వారా సుమారుగా రూ.800 కోట్ల నుంచి రూ.1,000 కోట్ల ఆదాయం వస్తుందని టిజిఎండిసి అంచనా వేస్తోంది.

ములుగు జిల్లాలో 30 రీచ్‌లు…
ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెంలో 7 ఇసుక రీచ్‌లు ఉండగా అక్కడ 3,82,275 మెట్రిక్‌టన్నుల ఇసుక అందుబాటులో ఉందని టిజిఎండిసి అధికారులు తె లిపారు. ఇక జయశంకర్ భూపాలపల్లిలో 18ఇసుక రీచ్‌లు ఉండగా అక్కడ 11,11,339 మెట్రిక్ టన్ను ల ఇసుక, జోగులాంబ గద్వాల్‌లో రెండు ఇసుకరీచ్ లు ఉండగా అక్కడ 52,941.1 మెట్రిక్ టన్నులు లభ్యం కానుంది. కామారెడ్డిలో మూడు ఇసుకరీచ్‌లుండగా అక్కడ 47, 923.7 మెట్రిక్‌టన్నులు, కరీంనగర్‌లో 14 ఇసుక రీచ్‌లుండగా అక్కడ 7,22, 874.5 మెట్రిక్ టన్నులు, ఖమ్మంలో ఒక ఇసుకరీచ్ ఉండగా అక్కడ 1,618. 92 మెట్రిక్‌టన్నులు, మహబూబాబాద్‌లో ఒక రీచ్ ఉండగా అక్కడ 12,729. 28 మెట్రిక్ టన్నులు, మం చిర్యాలలో 4 ఇసుక రీచ్ లు ఉండగా 5,91,742.5 మెట్రిక్ టన్నుల ఇసుక, మేడ్చల్‌లో ఒక రీచ్ ఉండగా అక్కడ 10,548.2 మెట్రిక్ టన్నులు, ములుగు జిల్లాలో 30 రీచ్‌లుండగా 24,30,485 మెట్రిక్ టన్నులుగా తేలింది.

నల్లగొండలో రెండు రీచ్‌లుండగా 1,35,157.2 మెట్రిక్ టన్నులు, పెద్దపల్లిలో 22 ఇసుకరీచ్‌లుండగా 4,75,301.2 మెట్రిక్ టన్నులు, రంగారెడ్డిలో రెండు ఇసుకరీచ్‌లుండగా 13,942.7 మెట్రిక్‌టన్నుల ఇసుక అందుబాటులో ఉందని టిజిఎండిసి తెలిపింది. మొత్తం అన్ని రీచ్‌లలో కలిపి 59,89,380 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని టిజిఎండిసి పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News