Monday, March 24, 2025

సంతాన ప్రాప్తిరస్తు ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది

- Advertisement -
- Advertisement -

విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా సంతాన ప్రాప్తిరస్తు. ఈ సినిమాను మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి రూపొందిస్తున్న ఈ చిత్రానికి రచయిత షేక్ దావూద్ జి స్క్రీన్ ప్లే అందించారు. యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ‘సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.ఈ నెల 26వ తేదీన ఫస్ట్ సింగిల్ ‘నాలో ఏదో..’ రిలీజ్ చేయబోతున్నారు. సునీల్ కశ్యప్ బ్యూటిఫుల్ కంపోజిషన్‌లో హీరో హీరోయిన్లు విక్రాంత్, చాందినీ చౌదరి మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ గా ఈ పాటను చిత్రీకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News