Sunday, February 23, 2025

అక్టోబర్ 2 నుంచి 14 వరకు పాఠశాలలకు దసరా సెలవులు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో పాఠశాలలకు అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు దసరా సెలవులు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దసరా పర్వదినానికి ముందు రాష్ట్రంలో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగ ఉంటుంది. అక్టోబర్ 12న దసరా పండుగ ఉంది. అక్టోబర్ 2న ఎంగిలిపూల బతుకమ్మ పండుగతో ప్రారంభమై, దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో సంబరాలు ముగుస్తాయి. దసరాకు రెండు రోజుల ముందు సద్దుల బతుకమ్మ పండుగ ఉంటుంది. సెలవుల అనంతరం వచ్చే 15వ తేదీ నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News