Sunday, February 23, 2025

భర్తపై కిరోసిన పోసి నిప్పంటించిన రెండో భార్య

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: ఆస్తుల వివాదం నేపథ్యంలో భర్తపై రెండో భార్య కిరోసిన్ పోసి తగలబెట్టిన సంఘటన భువనేశ్వర్ రాష్ట్రం గంజమ్ జిల్లా భంజన్‌నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ప్రఫూల్ సబత్ అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. కులడా గ్రామంలో ప్రఫూల్‌కు ఇద్దరు భార్యలకు కుమారులు ఉండడంతో ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. ఆస్తి వివాదాలు తారాస్థాయికి చేరుకోవడంతో రెండో భార్య భర్తపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. స్థానికుల వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. మెరుగున వైద్యం నిమిత్తం బెరంపూర్‌లోని ఎంకెసిజి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. నలుబై శాతం గాయాలతో అతడు చికిత్స పొందుతున్నాడని ఆస్పత్రి వర్గా వెల్లడించాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News