Wednesday, July 3, 2024

నేరేడుమెట్ లో బాలికపై ఐదుగురు గ్యాంగ్ రేప్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్ ప్రాంతం నేరేడుమెట్ లో దారుణం వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికపై ఐదుగురు యువకుల గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. మైనర్ అమ్మాయిని ట్రాప్ చేసి నేరేడు మెట్ తీసుకువెళ్లి గ్యాంగ్ రేప్ కు యువకులు పాల్పడ్డారు. కాచిగూడలో ఉంటున్న మైనర్ అమ్మాయికి యువకులు గంజాయి అలవాటు చేశారు. మైనర్ అమ్మాయి గంజాయి మత్తులోకి దిగగానే యువకులు అత్యాచారం చేశారు. జరిగిన ఘోరాన్ని తల్లికి చెప్పకుండా మైనర్ అమ్మాయి దాచిపెట్టింది. మైనర్ అమ్మాయి శరీరంలో మార్పులు రావడంతో తల్లి గమనించి నిలదీసింది. జరిగిన ఘోరాన్ని తల్లికి మైనర్ బాలిక వివరించింది.  కాచిగూడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి పోలీసులు నేరేడ్ మెట్ కు బదిలీ చేశారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News