Tuesday, September 17, 2024

అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటిన వ్యక్తి సురవరం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సురవరం ప్రతాప్ రెడ్డి అభ్యుదయ భావాలు గల వ్యక్తి అని మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. సురవరం సమాజంపై తనదైన ముద్ర వేశారని పొగిడారు. తెలంగాణ అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటిన వ్యక్తి అని, సువరం అనగానే అంటే ముందుగా గుర్తొచ్చేది గోల్కొండ పత్రిక అని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే ఈ గడ్డ మీద పుట్టిన గొప్పవారి గురించి చెప్పుకునే అవకాశం దక్కేది కాదన్నారు. విశిష్ట అతిథులుగా మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News