Thursday, September 19, 2024

తెలుగు వర్సిటీ ‘ప్రతిభ’ పురస్కారానికి సీనియర్ జర్నలిస్టు జి.వల్లీశ్వర్ ఎంపిక

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు విశ్వవిద్యాలయం 2021 సంవత్సరం ‘ప్రతిభ’ పురస్కారానికి పాత్రికేయ రంగంలో విశేష సేవలు అందించిన సీనియర్ జర్నలిస్టు జి. వల్లీశ్వర్ ఎంపికయ్యారు. ఏటా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 12 మందిని తెలుగు విశ్వవిద్యాలయం ఈ పురస్కారాలతో సత్కరిస్తూ ఉంటుంది.శ్రీ వల్లీశ్వర్ ‘ఈనాడు’ సంస్థలో ఏలూరు, తిరుపతి, విశాఖపట్నం, న్యూఢిల్లీ, హైదరాబాద్‌లలో దాదాపు 26 సంవత్సరాలు (1978- నుంచి 2004) రిపోర్టింగ్‌లో పని చేశారు. చివరి ఎనిమిదేళ్ళు అదే సంస్థలో ‘న్యూస్ టైమ్’ బ్యూరో ఛీఫ్‌గా విధులు నిర్వహించారు. ముఖ్యంగా విశాఖపట్నంలో నౌకాదళం, షిప్ యార్డు, స్టీల్ ప్లాంట్, పోర్ట్ ట్రస్ట్ తదితర ప్రభుత్వరంగ సంస్థలపై పరిశోధనా వ్యాసాలతో పాత్రికేయుడిగా విశిష్ట ముద్ర వేశారు. 2005 -15 కాలంలో ‘ఆంధ్ర ప్రదేశ్’ మాస పత్రిక ప్రధాన సంపాదకులుగా పని చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News