Tuesday, September 17, 2024

యశస్వికి ఏడో ర్యాంక్

- Advertisement -
- Advertisement -

ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్ విడుదల

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్లు సత్తా చాటారు. టాప్10లో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు తమ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. భారత యువ సంచలనం యశస్వి జైస్వాల్ తాజా ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానానికి చేరుకున్నాడు. యశస్వి ఒక ర్యాంక్‌ను మెరుగుపరుచుకున్నాడు. యశ స్వి ప్రస్తుతం 740 పాయింట్లతో ఏడో ర్యాంక్‌లో నిలిచాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 751 రేటింగ్ పాయింట్లతో ఆరో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఇక సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి రెండు ర్యాంక్‌లను మెరుగు పరుచుకుని 8వ స్థానానికి చేరుకున్నాడు.

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఆరు ర్యాంక్‌లు కోల్పోయి 9వ స్థానానికి దిగజారాడు. ఉస్మాన్ ఖ్వాజా (ఆస్ట్రేలియా) ఒక ర్యాంక్‌ను మెరుగుపరుచుకుని పదో స్థానానికి ఎగబాకాడు. కాగా, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ 881 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 859 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్‌కే చెందిన డారిల్ మిఛెల్ మూడో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. హారీ బ్రూక్ ఇం గ్లండ్ మూడు ర్యాంక్‌లను మెరుగుపరుచుకుని నాలుగో ర్యాంక్‌కు దూసుకెళ్లాడు. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) ఐదో ర్యాంక్‌లో కాపాడుకున్నాడు.

టాప్‌లోనే అశ్విన్

మరోవైపు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టాప్ ర్యాంక్ ను నిలబెట్టుకున్నాడు. అశ్విన్ 870 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ 874 పా యింట్లతో రెండో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. భారత స్టార్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా తాజా ర్యాంకింగ్స్‌లోనూ మూడో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. పాట్ కమిన్స్ నాలుగో, కగిసో రబడా (సౌతాఫ్రికా) ఐదో, లాథన్ లియాన్ (ఆస్ట్రేలియా) ఆరో ర్యాంక్‌లో నిలిచారు. భారత స్టార్ బౌలర్ రవీంద్ర జడేజా ఏడో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా 124 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. భారత్ రెండో, ఇంగ్లండ్ మూడో ర్యాంక్‌లో కొనసాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News