Monday, July 8, 2024

తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కెసిఆర్: షబ్బీర్ అలీ

- Advertisement -
- Advertisement -

పార్టీ ఫిరాయింపులపై బిఆర్‌ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఫైర్ అయ్యారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కెసిఆర్ అని, అందుకు నడిబజార్‌లో నిలబెట్టి ఆయన్ను శిక్షించాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతుంటే ఆ పార్టీ నేతలకు బాధ అవుతుందని, మరీ మా పార్టీ ఎమ్మెల్యేలను లాక్కోన్నప్పుడు ఈ బాధ ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కొని భట్టి విక్రమార్కకు అప్పట్లో ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా చేశారని ఆయన ధ్వజమెత్తారు. మండలిలో ఎమ్మెల్సీలను కూడా కెసిఆర్ లాక్కున్నారని ఆయన ఫైర్ అయ్యారు.

పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడటానికి బిఆర్‌ఎస్ నాయకులకు సిగ్గుండాలన్నారు. ఇక, సింగరేణిపై బిజెపి, బిఆర్‌ఎస్ డ్రామాలు అడుతున్నాయని ఆయన విమర్శించారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో సింగరేణిలో కార్మికుల సంఖ్య 71 వేలు ఉండేదని ఇప్పుడు వర్కర్ల సంఖ్య 21 వేలకు పడిపోయిందన్నారు. పదేళ్లలో బిజెపి, బిఆర్‌ఎస్ సింగరేణిని నాశనం చేశాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం కోసం 11 ఎకరాలు ఎందుకని, కోకాపేటలో బిఆర్‌ఎస్‌కు ఇచ్చిన భూములు ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు. ఆ భూమి వేలం వేసి వచ్చిన డబ్బులు రుణమాఫీకి ఉపయోగించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో గులాబీ పార్టీ ఖతం అయ్యిందని ఆయన వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News