చార్మింగ్ స్టార్ శర్వా తన మొట్టమొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘శర్వా38’ని ప్రారంభించడానికి సిద్ధంగా వున్నారు. ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. 1960ల చివరలో ఉత్తర తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులో సెట్ చేయబడిన ఈ సినిమా ప్రేక్షకులను మరపురాని అనుభూతిని అందించబోతోంది. ఈ చిత్రం హై-స్టేక్స్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోంది. శర్వా పాత్రను ప్రత్యేకంగా నిలబెట్టడానికి, టీం బాలీవుడ్ స్టైలిస్టులు ఆలిమ్ హకీమ్, పట్టణం రషీద్ల నైపుణ్యాన్ని ఉపయోగించుకుంది. శర్వా మేకోవర్ ఇప్పటికే సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా పలు భాషలలో సినిమా విడుదల కానుంది.
ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్..
- Advertisement -
- Advertisement -
- Advertisement -