Saturday, September 21, 2024

కరోనాతో షూటర్ దాదీ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Shooter dadi dead with corona virus

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని భాగ్‌పట్ జిల్లాకు చెందిన షూటర్ దాదీ చంద్రో తోమర్ కరోనాతో కన్నుమూశారు.  చంద్రోతోమర్(89) కరోనా వైరస్ సోకడంతో స్థానిక ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆమె చనిపోయింది. 60 సంవత్సరాల వయస్సులో షూటింగ్‌పై ఆసక్తితో ఓనమాలు నేర్చుకున్నారు. జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించి తనకంటూ గుర్తింపు పొందారు. చంద్రో తోమర్ జీవితం ఆధారంగా బాలీవుడ్ లో ‘సాండ్ కీ ఆంఖ్’ పేరుతో సినిమా తీశారు. ఆమె మృతి పట్ల కేంద్రమంత్రులు కిరణ్ రిజిజు, హర్‌దీప్ సింగ్ పూరి, భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్, భారత బ్యాడ్మింటన్ సైనా నెహ్వాల్, మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News