ప్రముఖ నటి సమంత ప్రస్తుతం నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. సమంత సొంత నిర్మాణ సంస్థ ‘త్రలాలా మూవింగ్ పిక్చర్స్’ ఆధ్వర్యంలో తొలి ప్రాజెక్ట్ ‘శుభం’ చిత్రీకరణ విజయవంతంగా పూర్తయింది. ఇక త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. కామెడీ ఎంటర్టైన్మెంట్తో పాటు థ్రిల్లింగ్ ఎక్స్పీరియెన్స్ ఇచ్చేలా ఈ చిత్రం ఉండనుందని సమాచారం. వసంత్ మరిగంటి రాసిన ఈ కథను సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కిస్తున్నారు. హర్షిత్ మల్గిరెడ్డి, శ్రియ కొంథం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి వంటి వారిని సినిమా బండి చిత్రంతో ప్రవీణ్ కండ్రేగుల పరిశ్రమకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. త్రాలాల బ్యానర్ మీద ఈ సినిమాను మొదటి ప్రాజెక్ట్గా ఎందుకు ఎంచుకున్నామో త్వరలోనే అందరికీ తెలుస్తుందని సమంత అన్నారు. ఈ చిత్రంలో సి.మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు.
‘శుభం’ విడుదలకు సిద్ధం
- Advertisement -
- Advertisement -
- Advertisement -