Friday, April 25, 2025

అక్కన్న మాదన్న ఆలయం ఆధ్వర్యంలో గోల్కొండ జగదాంబికకు పట్టువస్త్రాలు

- Advertisement -
- Advertisement -

చాంద్రాయణగుట్ట : పాతబస్తీ హరిబౌలిలోని చారిత్రక శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం వజ్రోత్సవాల (75వ)ను పురస్కరించుకొని గురువారం గోల్కొండ శ్రీ జగదాంబిక ఎల్లమ్మ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దేవాలయ అధ్యక్షులు రాందేవ్ అగర్వాల్ ఆధ్వర్యంలో మహంకాళి అమ్మవారికి పూజలు నిర్వహించారు. కమిటీ ప్రతినిధులంతా కలిసి బ్యాండు మేళాలతో శాలిబండ శ్రీ కాశీవిశ్వనాథ స్వామి దేవాలయానికి చేరుకున్నారు.

అక్కడ విఘ్నేశ్వరునికి, స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రతినిధులు ఊరేగింపుగా గోల్కొండ కోటకు తరలి వెళ్ళారు. అక్కడ జగదాంబిక అమ్మవారికి పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ నిర్వాహకులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జి.రాజరత్నం, ఎ.సతీష్ కుమార్, డి.ఆర్.ప్రభాకర్, ఎస్.పి.క్రాంతి కుమార్, జగన్మోహన్ కపూర్, ఎ.విజయ కుమార్, జి.శ్రీనివాస్, పి.మహేష్, ఎ.రజత్, ఎల్.అరుణ్, పి.సాయి కుమార్, తనీష్, సాయినాథ్ షిండే తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News