Thursday, September 19, 2024

సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సింబా

- Advertisement -
- Advertisement -

అనసూయ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సింబా’. సంపత్ నంది టీం వర్క్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద సంపత్ నంది, దాసరి రాజేందర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంపత్ నంది అందించిన ఈ కథకు మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. బుధవారం నాడు ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనసూయ మాట్లాడుతూ “వృక్షో రక్షతి రక్షితః అనే కాన్సెప్ట్ అందరికీ తెలిసిందే. ప్రస్తుతం పర్యావరణాన్ని మనం ఎలా పాడు చేస్తున్నామో.. దానికి ఎలాంటి పర్యవసనాలను చూస్తున్నామో అందరికీ తెలిసిందే.

సింబా చాలా మంచి కాన్సెప్ట్‌తో రాబోతోంది. సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్‌తో రాబోతోంది. అందరికీ నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది”అని అన్నారు. మురళీ మనోహర్ మాట్లాడుతూ “ఇంత వరకు ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు. అందరికీ ఈ సినిమా నచ్చుతుందని భావిస్తున్నాను”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దాసరి రాజేందర్ రెడ్డి, దివి, వశిష్ట, కేతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, కృష్ణ ప్రసాద్, రాజీవ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News