హైదరాబాద్: ఈ నెల 25వ తేదీన కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లో జరిగిన హత్య కేసులో ఆరుగురు నిందితులను చైతన్యపురి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ మండలం, రాజ్నెళ్లి గ్రామానికి చెందిన ఎండి ఫిరోజ్, ఎండి ఖమర్, నగరానికి చెందిన ఎండి ఖదీర్, వికారబాద్కు చెందిన ఎండి ఖలీం, రంగారెడ్డి జిల్లా, ఎన్టీఆర్ నగర్కు చెందిన ఎండి హజీ మియా, ఎండి యుసుఫ్ను పోలీసులు అరెస్టు చేశారు. కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లో రాజ్బహదూర్ హమాలీగా పనిచేస్తున్నాడు. ఈ నెల 25వ తేదీన మద్యం తాగి ఫుట్పాత్పై పడుకున్నాడు. ఎండి ఫిరోజ్, ఎండి ఖమర్ కలిసి కత్తులతో రాజ్బహదూర్ ఛాతిపై పొడిచి చంపివేశారు. దానికి మిగతా నిందితులు సహకరించారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు చైతన్యపురి ఇన్స్స్పెక్టర్ తెలిపారు.
Six Arrested in Fruit Market Murder Case