Wednesday, October 16, 2024

కరకగూడెం ఎన్‌కౌంటర్ బూటకం

- Advertisement -
- Advertisement -

భద్రాద్రికొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం బోడగుట్ట అటవీ ప్రాంతంలో సెప్టెంబర్ 5 తెల్లవారుజామున ఆరుగురు మావోయిస్టులను (అందరూ ఆదివాసులే) కాల్చి చంపిన పోలీసు అధికారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని మానవ హక్కుల వేదిక ప్రధాన కార్యదర్శి డా. ఎస్. తిరుపతయ్య, తెలంగాణ, ఆంధ్ర సమన్వయ కమిటీ స భ్యులు వి. ఎస్ కృష్ణ -డిమాండ్ చేశారు. ఆ సంఘటనకు సంబంధించి సిబిఐ చేత కాని, తెలంగాణ రాష్ట్ర పోలీసులతో సంబంధం లేని స్వతంత్ర దర్యా ప్తు సంస్థ చేత కాని నేర పరిశోధన జరిపించాలని మానవ హక్కుల వేదిక కోరుతోందన్నారు. ముగ్గు రు సభ్యులతో కూడిన మానవ హక్కుల వేదిక నిజనిర్ధారణ బృందం అక్టోబర్ 13న కరకగూడెం, పి నపాక మండలాల్లోని గ్రామాలను సందర్శించి స్థా నికులతో మాట్లాడింది. పోలీసులు చెబుతున్నట్లు రెండు వైపులా కాల్పులు జరగలేదని మా నిర్ధారణలో తేలిందన్నారు. దట్టమైన అడవిలో తెల్లవారుజామున మావోయిస్టు దళంపై ఏకపక్ష కాల్పులు జరిగినట్టు స్పష్టమవుతోందని
వెల్లడించారు.

పోలీసులు మావోయిస్టుల మీద హత్యా ప్రయత్నం చే శారన్న నేరం కింద ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు కాని అది చట్ట ప్రకారం సరిపోదు. ఆరుగురు వ్యక్తులపై కాల్పుల సంఘటనలో పాల్గొన్న పోలీసులందరిపైనా హత్యా నేరం కింద, ఇంకా ఎస్‌సి, ఎస్‌టి (అత్యాచార నిరోధక) చట్టం కింద కేసులు నమోదు చేయాలని, వారు చెబుతున్నట్లుగా పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారా? లే దా అన్నది నిర్ధారించాల్సింది న్యాయస్థానం, పోలీసులు కాదన్నారు. ఇరు వైపులా కాల్పులు జరిగాయని ఏకపక్షంగా నిర్ధారించేసి కేసును మూసివేస్తే అది చట్టాన్ని, రాజ్యాంగాన్నీ అపహాస్యం చేసినట్లు అవుతుందన్నారు. కాల్పులు జరిగిన ప్రదేశానికి మీడియాని అనుమతించకపోవడం మీద మాకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో ‘ఎన్‌కౌంటర్’ జరిగిన ప్రదేశాలకు మీడియాను వెళ్ళనీయకపోవడం గతంలో జరగలేదన్నారు. పోలీసులు ఏమి దాయదల్చుకున్నారు? నేరం జరిగిన ప్రదేశంలో ఆధారాలు పాడవకుండా చూసుకుంటే సరిపోతుంది కాని మీడియాను అసలు వెళ్ళనీయక పోవటం ఏమిటని ప్రశ్నించారు. ఆందోళన కలిగించే ఇంకొక విషయం ఏమిటంటే స్థానిక కోయ జాతి ఆదివాసులు భయభ్రాంతుల్లో బతుకుతున్నారని, నిత్య పహారా కాస్తున్న పోలీసుల సమక్షంలో స్థానిక ఆదివాసులు నోరు మెదపటానికి కూడా భయపడుతున్నారన్నారు.

సెప్టెంబర్ రెండవ వారంలో నిజనిర్ధారణ కోసం వెళ్ళిన పౌర హక్కుల సంఘం బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారన్నారు. పోలీసులు ఎంత న్యాయబద్ధంగా ఉండాలో ఎంత విచ్చలవిడిగా ప్రవర్తించ వచ్చో అన్నది అధికారంలో ఉన్న పాలకపక్షం చేతుల్లోనే వుందన్నారు. పోలీసులు న్యాయబద్ధంగా వ్యవహరించి, జవాబుదారీగా ఉండేలా చూడాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని మానవ హక్కుల వేదిక ఈ సందర్భంగా గుర్తు చేస్తోందన్నారు. న్యాయసూత్రాలను అతిక్రమిస్తూ జరిపే ఎన్‌కౌంటర్ హత్యలకు ఒక పక్క పచ్చ జెండా ఊపుతూ మరో పక్క ’ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం’ అంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీకి అర్ధం లేకుండా పోతోందన్నారు.రాష్ట్ర పాలకుల ఆమోదం, ప్రోత్సాహంతో సాగుతున్న ఈ ‘ఎన్‌కౌంటర్’ హత్యాకాండను ఆపాలని, శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులకు ఉందన్నారు. అలాగే మావోయిస్టుల హింసను ఎదుర్కోవాల్సిన బాధ్యత కూడా ఉందని వెల్లడించారు. ఏదైనా అది న్యాయసూత్రాల
కు, చట్టబద్ధ పాలనకు లోబడి, ప్రజల హక్కులను గౌరవిస్తూ జరగాలన్నారు.

’నక్షలైటు ఉగ్రవాదాన్ని’ సాకుగా చూపెడుతూ చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడరాదు. పోలీసులు ఎన్‌కౌంటర్ల పేరిట ఈ రకమైన హత్యాకాండకు పాల్పడటం నాగరిక సమాజం అంగీకరించదని వెల్లడించారు. మావోయిస్టు ఉద్యమాన్ని కేవలం శాంతిభద్రతల సమస్యగా మాత్రమే చూడవద్దని మేము కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విన్నవిస్తున్నామన్నారు. మావోయిస్టులు వారి రాజకీయ వ్యూహంలో భాగంగా హింసను ప్రయోగిస్తారన్నది వాస్తవామే గాని అది ప్రధానంగా రాజకీయ ఉద్యమం అని, దానిని రాజకీయంగానే ఎదుర్కోవాలి గాని వన్యమృగాలను వేటాడినట్టు చుట్టుముట్టి కాల్చి చంపే లైసెన్సు జారీ చేయడం చట్టవిరుద్ధం, అనాగరికమని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News