Sunday, September 8, 2024

సరిహద్దుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతం

- Advertisement -
- Advertisement -

Six militants killed in Nagaland border

ఆంగ్లాంగ్: అస్సాం-నాగాలాండ్ సరిహద్దు వెంబడి పశ్చిమ కార్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు డిమాసా నేషనల్ లిబరేషన్ ఆర్మీ (డిఎన్‌ఎల్‌ఎ) ఉగ్రవాదులు ఆదివారం మృతి చెందారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. వెస్ట్ కార్బీ ఆంగ్లాంగ్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఎ.ఎస్.పి) ప్రకాష్ సోనోవాల్ నేతృత్వంలో పోలీసు అధికారులు, అస్సాం రైఫిల్స్ సిబ్బంది బృందం జిల్లాలో ఉమ్మడి ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలిపారు. భద్రతా సిబ్బంది,  ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు సభ్యులను మిచిబైలుంగ్ ప్రాంతంలో కాల్చి చంపినట్లు అధికారి తెలిపారు. హతమార్చిన ఉగ్రవాదుల నుంచి నాలుగు ఎకె -47 రైఫిళ్లు, అనేక రౌండ్ల మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఉగ్రవాదులు కోసం గాలిస్తున్నామని సీనియర్ అధికారి తెలిపారు

Six militants killed in Nagaland border

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News