Friday, September 20, 2024

పశ్చిమ బెంగాల్‌ లో ఆరో విడత పోలింగ్ ప్రారంభం…

- Advertisement -
- Advertisement -

Six Phase polling start in west bengal

 

కోల్ కతా:  పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ఆరో విడత పోలింగ్‌ గురువారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది.  సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు భారీగా తరలి వస్తున్నారు. కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బయపడుతున్నట్టు సమాచారం. ఆరో విడతలో 43 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 306 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. పోలీసులు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 1071 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News