Tuesday, March 18, 2025

రిజిస్ట్రేష్లనకు స్లాట్ బుకింగ్

- Advertisement -
- Advertisement -

దానితో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో
బయోమెట్రిక్ విధానం ఏప్రిల్
తొలివారంలో పైలెట్ ప్రాజెక్టు 15
నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి
నిషేధిత జాబితాలోని స్థలాలను
రిజిస్ట్రేషన్ చేస్తే అధికారులపై కఠిన
చర్యలు సమీక్షా సమావేశంలో మంత్రి
పొంగులేటి ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియను
వేగవంతం చేయాలని ఆదేశాలు
మన తెలంగాణ / హైదరాబాద్: ప్రజలకు సమర్ధవంతంగా, సులువుగా, పారదర్శకంగా అవినీతిరహితంగా మరింత మెరుగైన సేవలందించే విధం గా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ తో పాటు బయోమెట్రిక్ విధానాన్ని తీసుకురానున్నట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం సచివాలయంలో స్టాంప్స్ అండ్ రిజిస్టేషన్స్ శాఖపై మంత్రి సుధీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ సెక్రెటరీ జ్యోతి బుద్దప్రకాష్, సిసిఎల్‌ఎ కార్యదర్శి మందా మకరంద్, ఐటి సెక్రెటరీ బావేష్, ఆ రు జోన్ల డిఐజిలు, ఉమ్మడి జిల్లాల జిల్లా రిజిస్ట్రార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ ప్రస్తుతం

ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్‌కు కనీ సం 45 నిమిషాల నుంచి గంటకు పైగా సమయం పడుతోందని, ఈ స్లాట్ బుకింగ్ విధానం ద్వారా పది నుంచి 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. ఈ విధానాన్ని ఏప్రిల్ మొ దటి వారంలో పైలట్ ప్రాజెక్టుగా కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలుచేయనున్నట్లు వెల్లడించారు. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం సామాన్యులు నిరీక్షించే పరిస్థితి లేకుండా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆధునీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఆర్టిఫిషియ ల్ ఇంటెలిజెన్స్, చాట్ బాట్స్ సేవలను వినియోగించుకోవాలని ఆయన అధికారులకు సూచించా రు. స్లాట్ బుకింగ్ విధానాన్ని దృష్టిలో పెట్టుకుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను రీ అర్గనైజేషన్ చేయాలని అధికారులకు సూచించారు.

నిషేధిత జాబితాలో ఉన్న ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ సబ్ రిజిస్ట్రార్‌లు రిజిస్ట్రేషన్ చేయకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. భూ భారతి తరహాలో ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ను ఏర్పాటుచేసి నిషేధిత ఆస్తుల వివరాలను అందులో పొందుపరిచి రెవెన్యూ శాఖకు అనుంసధానం చేయాలని సూచించారు. నిషేధిత జాబితాలో ఉన్న గజం స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. నిషేధిత జాబితాలో ఉన్న ఆస్తులలో గతం భూమిని రిజిస్ట్రేషన్ చేసినా మరుక్షణంలోనే తన కార్యాలయంతో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రధాన కార్యాలయంలో డిస్‌ప్లే అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పొంగులేటి వివరించారు. లక్షలాది కుటుంబాలకు మేలుచేసే ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. జిల్లా రిజిస్ట్రార్‌లు ప్రతిరోజు దీనిపై సమీక్షించాలని, ఎల్‌ఆర్‌ఎస్ ధరఖాస్తులపై ఎలాంటి సందేహాలున్నా ఉన్నతాధికారులను సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకుని సమస్యలను పరిష్కరించాలే తప్ప పెండింగ్‌లో ఉంచరాదని స్పష్టం చేశారు. తప్పు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయవద్దని అధికారులకు హితవు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News