Sunday, February 23, 2025

అలా చేస్తేనే.. డబ్ల్యూపీఎల్‌ను ఆదరణ లభిస్తుంది: స్మృతి మంధాన

- Advertisement -
- Advertisement -

రానున్న రోజుల్లో ఐపిఎల్‌కు దీటుగా డబ్లూపిఎల్ ఎదగడం ఖాయమని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళా టీమ్ కెప్టెన్ స్మృతి మంధాన జోస్యం చెప్పింది. తొలి సీజన్‌లోనే మహిళల ఐపిఎల్‌కు మంచి ఆదరణ లభించిందనే విషయాన్ని గుర్తు చేసింది.

ఐపిఎల్ మాదిరిగానే రానున్న రోజుల్లో మహిళల లీగ్ కూడా అభిమానులను ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. డబ్లూపిఎల్‌ను ఒక్క నగరంలో కాకుండా వేర్వేరు నగరాల్లో నిర్వహిస్తే మరింత ఆదరణ లభించడం ఖాయమని మంధాన అభిప్రాయపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News