Sunday, September 8, 2024

కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

మాదాపూర్ దుర్గం చెరువులో దూకి సాప్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మాదాపూర్ నాలెడ్జ్ సిటీలోని ఓ సాప్ట్ కంపెనీలో సాప్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ముషీరాబాద్ కు చెందిన బాలాజీ(25).. రోజూ మాదిరిగానే ఈ నెల 24న ఉదయం ఆఫీస్ కు వెళ్లి.. అర్ధరాత్రి అయిన ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు.. బాలాజీకి ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ రావడం, స్నేహితులను విచారించిన బాలాజీ ఆచూకీ లభించకపోవడంతో 25వ తేదిన రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యులు మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చారు.

పోలీసులు ఐటీ కంపెనీలో విచారించగా 24వ తేది రాత్రి 8:30 గంటలకు బయటికి వెళ్లినట్లు గుర్తించారు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలసీులు మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ మీదు నుంచి కిందికి దూకినట్లు గుర్తించారు. అనంతరం దుర్గం చెరువులో గలిస్తుండగా శుక్రవారం సాయంత్రం నీటిలో బాలాజీ మృతదేహం లభ్యమైంది. మెడలో ఉన్న ఐడీ కార్డు ఆధారంగా బాలాజీగా గుర్తించి పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

కాగా..కొంతకాలంగా ఓ యువతిని బాలాజీ ప్రేమిస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ క్రమంలో యువతి పెళ్లి కోసం ఒత్తిడి చెయ్యగా ప్రేమ విషయం ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పలేక బాలాజీ ఆత్మహత్య చేసుకున్నాడని…ప్రేమ వ్యవహారమే బాలాజీ ఆత్మహత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు రాయదుర్గం పోలీసులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News