దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఆలయంలో 42 ఏళ్ల తర్వాత ప్రత్యేక చొరవ తీసుకొని మహా కుంభాభిషేకం నిర్వహించడంపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ప్రశంసించారు. కాళేశ్వర, ముక్తీశ్వరస్వామి మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించడం హర్షణీయమన్నారు. ఈ మేరకు కొండా సురేఖకు సోనియాగాంధీ లేఖ రాశారు. త్రివేణి సంగమం జలాలకు ఎంతో ప్రత్యేకత ఉందని
, తనకు ప్రసాదాన్ని, త్రివేణి సంగమం పవిత్ర జలాలను పంపించిందుకు కొండా సురేఖకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కాళేశ్వర, ముక్తీశ్వరస్వామి స్థల విశిష్టతను, ప్రశస్థను తెలియజేసినందుకు సురేఖను లేఖ ద్వారా సోనియా అభినందించారు. కాగా, 1982లో మొదటిసారి కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ జరిగిన సమ యంలో ఇక్కడ మహా కుంభాభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ 42 ఏళ్ల తర్వాత గత నెల 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మహాకుంభాభిషేక వేడుకలను నిర్వహించారు.