Saturday, February 22, 2025

ఉప్పుగూడ మహంకాళిని దర్శించిన సౌమ్యమిశ్రా

- Advertisement -
- Advertisement -

చాంద్రాయణగుట్ట: ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయం 74వ వార్షిక బోనాల ఉత్సవాలలో భాగంగా గురువారం అమ్మవారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూ జలు నిర్వహించారు. రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ సౌ మ్య మిశ్రా, శృంగేరి పీఠం తెలంగాణ రాష్ట్ర ప్ర భుత్వ వేద పండితులు గోపీకృష్ణ శర్మ, బిజెపి నేత కీర్తిరెడ్డి తదితరులు దర్శించుకొని పూజలు చేశారు. వేదపండితులు వారికి వేదాశీర్వచనా లు పలికారు. ఆలయ అధ్యక్షులు జనగామ మధుసూదన్‌గౌడ్ వారికి ఘన స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి కీర్తి నరేందర్ ముదిరాజ్, ఆలయ ప్రతినిధులు చంద్రమోహన్, అనిల్, సుభాష్, శివకుమార్, సతీష్, బాబురావు, భవానీ, శంకర్, ఆనంద్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News