Monday, March 24, 2025

25 ఏళ్లు ఆపండి

- Advertisement -
- Advertisement -

డీలిమిటేషన్‌పై జెఎసి డిమాండ్

నియోజకవర్గాల పునర్విభజన నిష్పాక్షికంగా జరగాలి ఈ ప్రక్రియలో అన్ని రాష్ట్రాల రాజకీయ
పార్టీలకు, ప్రభుత్వాలకు భాగస్వామ్యం కల్పించాలి వాటి వాణికి ప్రాధాన్యం ఇవ్వాలి జాతీయ
జనాభా క్రమబద్ధీకరణ లక్షం ఇంకా అందుకోనందున ప్రక్రియను వాయిదా వేయాలి జనాభా
నియంత్రణలో విజయం సాధించిన రాష్ట్రాలను శిక్షించరాదు ఇందుకు అవసరమైన రాజ్యాంగ
సవరణలు చేయాలి ఇందుకు భిన్నంగా కేంద్రం వ్యవహరిస్తే ఆ ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు
పార్లమెంటరీ వ్యూహాలను కోర్ కమిటీ ఖరారు చేస్తుంది ఈ మేరకు డీలిమిటేషన్ జెఎసి
తీర్మానం ప్రస్తుత పార్లమెంట్ సమావేశంలోనే వినతిపత్రం సమర్పించాలని నిర్ణయం తదుపరి జెఎసి
సమావేశం హైదరాబాద్‌లో నిర్వహణ డీలిమిటేషన్ ప్రక్రియపై న్యాయపోరాటానికైనా సిద్ధం :
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దక్షిణాదిపై వేలాడుతున్న కత్తి : కేరళ సిఎం పినరయి విజయన్
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం : నవీన్ పట్నాయక్ ప్రమాదంలో సమాఖ్య వ్యవస్థ : డికె
శివకుమార్ చెన్నైలో జరిగిన జెఎసి సమావేశానికి నాలుగు రాష్ట్రాల సిఎంలు హాజరు వర్చువల్‌గా
పాల్గొన్న ఒడిశా మాజీ సిఎం నవీన్ పట్నాయక్ ఎపి సిఎం చంద్రబాబు, మాజీ సిఎం జగన్ గైర్హాజరు

చెన్నై : 1971 జనాభా లెక్కల ప్రాతిపదికపై పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజనను మరో 25 సంవత్సరాల పాటు వా యిదా వేయాలని కేంద్రానికి డిఎంకె నాయకత్వంలోని సంయు క్త కార్యాచరణ కమిటీ (జెఎసి) సమావేశం శనివారం విజ్ఞప్తి చే సింది. పార్లమెంట్ సభ్యులు తమ కోర్కెలపై ఒక ఉమ్మడి వినతిపత్రాన్ని ప్రస్తుత పార్లమెంటరీ సమావేశాల సమయంలోనే ప్రధాని నరేంద్ర మోడీకి సమర్పించాలని జెఎసి సమావేశం నిర్ణయించింది. జెఎసి సమావేశంలో ఈ మేరకు ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించారు. నిష్పాక్షిక రీతిలో డీలిమిటేషన్’ జరిగేలా చూడాలని కోరుతూ డిఎంకె నేతృత్వంలో జెఎసిని ఏర్పాటు చేసిన విష యం విదితమే. ప్రజాస్వామ్య వ్యవస్థ ‘ఉద్దేశం, లక్షణం’ మెరుగుదలకు కేంద్ర ప్రభుత్వ చేపట్టే ఏ డీలిమిటేషన్ ప్రక్రియనైనా పారదర్శకంగా నిర్వహించాలి.

ఈ ప్రక్రియలో అన్ని రాష్ట్రాల రాజకీ య పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం కల్పించాలి. వాటి తో చర్చించి.. వాటి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని తీ ర్మానం కోరింది. ‘42వ, 84వ, 87వ రాజ్యాంగ సవరణల వెను క శాసనవ్యవస్థ ప్రధానోద్దేశం జనాభా నియంత్రణ చర్యలను సమర్థంగా అమలు జరిపిన రాష్ట్రాలను పరిరక్షించడం/ ప్రోత్సహించడం అయినందున, జాతీయ జనాభా క్రమబద్ధీకరణ లక్షాన్ని ఇంకా సాధించనందున 1971 జనాభా లెక్కల ప్రాతిపదికపై పార్లమెంటరీ నియోజకవర్గాల స్తంభనను మరి 25 సంవత్సరాలు పొడిగించాలి’ అని జెఎసి తన తీర్మానంలో సూచించింది. జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు జరిపి, తద్వారా జనాభా వాటా తగ్గిన రాష్ట్రాలను శిక్షించరాదని, ఇందు నిమిత్తం కేంద్రం అవసరమైన రాజ్యాంగ సవరణలు చేయాలని జెఎసి కోరింది.

ప్రాతినిధ్య రాష్ట్రాల పార్లమెంట్ సభ్యులతో కూడిన కోర్ కమిటీ పైన పేర్కొన్న సూత్రాలకు భిన్నంగా ఏ డిలిమిటేషన్ ప్రక్రియనైనా చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేసే ఏ ప్రయత్నాలనైనా తిప్పికొట్టేందుకు పార్లమెంటరీ వ్యూహాలను సమన్వయం చేస్తుంది. ఎంపిల కోర్ కమిటీ పైన ప్రస్తావించిన విధంగా ఉమ్మడి వినతిపత్రాన్ని ప్రస్తుత పార్లమెంటరీ సెషన్‌లో ప్రధానికి అందజేస్తుంది’ అని తీర్మానం తెలియజేసింది. సమావేశంలో ప్రాతినిధ్యం ఉన్న వివిధ రాష్ట్రాల రాజకీయ పార్టీలు ఈ అంశంపై తమ తమ రాష్ట్రాలలో సముచిత శాసనసభ తీర్మానాలు తీసుకువచ్చేందుకు ప్రయత్నించి, కేంద్ర ప్రభుత్వానికి ఆ విషయం నివేదిస్తాయని తీర్మానం తెలిపింది. ‘గత డిలిమిటేషన్ ప్రక్రియల చరిత్ర, నేపథ్యం, తమ తమ రాష్ట్రాల పౌరులపై ప్రతిపాదిత డిలిమిటేషన్ పరిణామాల గురించిన సమాచారాన్ని సమన్వయీకృత ప్రజాభిప్రాయ సేకరణ వ్యూహం ద్వారా అందజేసేందుకు అవసరమైన యత్నాలను జెఎసి చేస్తుంది’ అని తీర్మానం తెలియజేసింది. ఇది ఇలా ఉండగా, డిఎంకె సామాజిక మాధ్యమంలో అడ్వర్టైజ్‌మెంట్‌ల ద్వారా డిలిమిటేషన్ గురించిన సమాచారం పంపిణీకి తన యత్నాలు ప్రారంభించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News