Sunday, September 8, 2024

పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు

- Advertisement -
- Advertisement -

Special trains on various routes: South Central Railway

హైదరాబాద్: ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్‌ఓ సిహెచ్ రాకేశ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈమేరకు నర్సాపూర్-టు సికింద్రాబాద్ (07455) ట్రైయిన్ ఈనెల 21, 28 తేదీల్లో నర్సాపూర్ నుంచి సాయంత్రం 6 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 4.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. దీంతోపాటు సికింద్రాబాద్ టు -విజయవాడ (07456) ట్రైయిన్ ఈనెల 22, 29 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి రాత్రి 11.55 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.50 గంటలకు విజయవాడ చేరుకుంటుందని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. హైదరాబాద్- టు గోరఖ్‌పూర్ (02575/02576) ట్రైన్ ఈనెల 19వ తేదీ రాత్రి 9.05 గంటలకు బయల్దేరి రెండోరోజు ఉదయం 6.30 గంటలకు గోరఖ్‌పూర్ చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో 21వ తేదీ ఉదయం 8.30 గంటలకు గోరఖ్‌పూర్ నుంచి బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3.20 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుందని దక్షిణమధ్య రైల్వే తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News