- Advertisement -

దర్యాప్తు మొదలెట్టిన డిజిసిఎ
న్యూఢిల్లీ: జమ్మూకి టేకాఫ్ చేయడానికి ముందు సోమవారం పార్కింగ్ స్థానం నుంచి వెనక్కి కదిలిని స్పైస్జెట్ విమానం రెక్క ఒకటి ఢిల్లీ విమానాశ్రయంలో మెరుపు స్తంభాన్ని ఢీకొనడంతో దెబ్బతింది. ఉదయం 9.20 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదు. దీంతో సిబ్బంది వెంటనే ప్రయాణికులను విమానం నుంచి దించేసి మరో విమానంలో తరలించారు. ఇదిలావుండగా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏవియేషన్(డిజిసిఎ) ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించింది.
- Advertisement -