Sunday, September 8, 2024

టీ20 సిరీస్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక

- Advertisement -
- Advertisement -

మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా శ్రీలంక పల్లెకెలెలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శ్రీలంక జట్టుతో టీమిండియా తలపడుతోంది. మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ ముందుగా బ్యాటింగ్ చేపట్టనుంది. తొలి మ్యాచ్ లో విజయం సాధించిన ఈ సిరీస్ లో బోణీ కొట్టాలని ఇరుజట్లు భావిస్తున్నాయి.

జట్ల వివరాలు:
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(w), కుసల్ పెరీరా, కమిందు మెండిస్, చరిత్ అసలంక(సి), దసున్ షనక, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, అసిత ఫెర్నాండో, దిల్షన్ మధుశంక

భారత్: శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్(సి), రిషబ్ పంత్(w), రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News