- Advertisement -
హైదరాబాద్: లోకల్ కేబుల్ ఆపరేటర్లను టీ నెక్ట్స్ లో భాగస్వామ్యం చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. టీ- ఫైబర్ నూతన కార్యాలయాన్ని శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ ఛైర్మన్ గా శ్రీధర్ బాబు బాధ్యతలు స్వీకరించారు. టీ-ఫైబర్, టీ-నెక్ట్స్ లోగోను ఆవిష్కరించారు. ఆయన సంగారెడ్డి శ్రీరాంపూర్ వాసులతో మాట్లాడారు. 6 నెలల్లో ప్రతి ఇంటికీ స్మార్ట్ టీవీ, ఫైబర్ కనెక్టివిటీ అందిస్తామన్నారు. టీ- నెక్ట్స్ ద్వారా స్మార్ట్ టెలివిజన్ పరిచయం చేయబోతున్నామని చెప్పారు. సమస్యల పరిష్కారానికి ‘టెరా’ అనే చాట్ బాట్ ను ఆవిష్కరించించామని తెలియజేశారు. టీ ఫైబర్, టీ నెక్ట్స్ సేవలు ప్రజలకు తక్కువ ధరల్లో అందిస్తున్నామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
- Advertisement -