Sunday, September 8, 2024

జయజయహేకు జై

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ :‘జయ జయహే తెలంగాణ’ గేయాన్ని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించిన ట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. రా ష్ట్రం ఆవిర్భవించి ఈ ఏడాది జూన్ 2వ తేదీ నాటికి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ధి ముగింపు వేడుకలను ఘనంగా ని ర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అదే వేడుకల సందర్భంగా జయ జయహే తెలంగాణ గీతా న్ని జాతికి అం కితం చేస్తామని ఆయన చెప్పారు. ఉద్యమ కాలంలో అందరినీ ఉర్రూతలూగించిన తెలంగాణ ఖ్యాతిని చాటిన ఈ గీతా న్ని భవిష్యత్‌లో తరతరాలు పాడుకునేలా, అందరి ఆమోదం తో రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు సిఎం తెలిపారు.

తెలంగాణ కవి, రచయిత అందెశ్రీ ఇరవై ఏళ్ల క్రి తం రాసిన ఈ గీతాన్ని యధాతథంగా ఆమోదించినట్లు ఆయన ప్రకటించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సం గీతంతో పాటు స్వరాలు కూర్చారు. సచివాలయంలో గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖతో పాటు మాజీ మంత్రి జానారెడ్డి, ప్రొఫెసర్ కోదండరాంతో పాటు కవి అందెశ్రీ, సంగీత దర్శకులు కీరవాణి, సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు ఎంపిలు, ఎమ్మెల్యేలు, తెలంగాణ బిల్లును ఆమోదించినప్పుడు సభలో ఉన్న మాజీ ఎంపీలు, ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు.

ఈ రెండింటినీ రాష్ట్ర గీతంగానే పరిగణిస్తాం
ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర గీతంతో పాటు రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ముగింపు వేడుకల నిర్వహణపై వారితో చర్చించారు. జయ జయహే తెలంగాణ గీతాన్ని రెండు వర్షన్లలో తయారు చేశారు. 2.30 నిమిషాల నిడివితో ఒక వర్షన్, 13.30 నిమిషాల నిడివితో పూర్తి వర్షన్ రూపొందించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆలపించేందుకు వీలుగా పూర్తి గేయంలో ఉన్న మూడు చరణాలతో రెండున్నర నిమిషాల నిడివితో సంక్షిప్త గేయం ఉంటుందని సిఎం పేర్కొన్నారు. ఈ రెండింటినీ రాష్ట్ర గీతంగానే పరిగణిస్తామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా కీరవాణి సంగీత సారథ్యంలోని యువ గాయనీ గాయకుల బృందం ఆలపించిన ఈ గీతం అందరినీ అలరించింది.

రాష్ట్ర చిహ్నానికి సంబంధించి 500 నమూనాలు
తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని, అందులో భాగంగానే రాష్ట్రానికి సంబంధించిన సంక్షిప్త రూపం టిఎస్‌ను టిజిగా మార్చినట్లు సిఎం రేవంత్ తెలిపారు. వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లతో పాటు అన్ని ప్రభుత్వ సంస్థలు టిజిగా మార్పు చేశామన్నారు. కేబినేట్‌లో తీసుకున్న నిర్ణయం మేరకే రాష్ట్ర గీతాన్ని ఆమోదించటం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని నిర్ణయం జరిగిందని సిఎం చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కళాకారుల నుంచి దాదాపు 500 నమూనాలు తమకు అందించినట్లు సిఎం చెప్పారు. ఇంకా నమూనాలన్నీ చర్చల దశలోనే ఉన్నాయని, చిహ్నానికి సంబంధించిన తుది రూపం ఇంకా ఖరారు కాలేదని ఆయన చెప్పారు.

తెలంగాణ తల్లి విగ్రహాం, కొత్త చిహ్నంపై తప్పుడు ప్రచారాలు వద్దు
తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా తుది నిర్ణయమేది జరగలేదని, కళాకారులు వివిధ నమూనాలు తయారు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి అపోహాలు, తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా తెలంగాణ ప్రతిష్టను ఇనుమడించేలా, భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా తమ కార్యాచరణ ఉంటుందని సిఎం రేవంత్ వారితో చెప్పారు.

అధికారిక కొత్త చిహ్నం ఆవిష్కరణ వాయిదా
తెలంగాణ అధికారిక కొత్త చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడింది. సోషల్‌మీడియాలో రెండు రోజులుగా కొత్త అధికారిక చిహ్నం ఇదే, ఇవే మూడు డిజైన్లు, అదే ఫైనల్ లోగో అని ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. అయితే కొత్త అధికారిక చిహ్నం ఖరారు చేయలేదని సిఎం పేర్కొనడంతో పుకార్లకు ఫుల్‌స్టాప్ పడింది. తొలుత తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 02వ తేదీన కొత్త అధికారిక రాజముద్ర లోగోను విడుదల చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి భావించిన దానిపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించడంతో ఇప్పుడు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కాకతీయ కళాతోరణం, చార్మినార్ తొలగించి వాటి స్థానంలో అమరవీరుల స్థూపం, బతుకమ్మతో కొత్త చిహ్నం ఖరారు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.

12 చరణాలతో రాష్ట్ర గీతం
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉర్రూతలూగించిన అందెశ్రీ రచించిన ’జయ జయహే తెలంగాణ’ గీతాన్ని సరికొత్త స్వరంతో రాష్ట్ర ప్రభుత్వం వచ్చేనెల 02వ తేదీన విడుదల చేయబోతుంది. ఈ క్రమంలో రాష్ట్ర ఆవిర్భావానికి ముందు రచించిన ఈ గీతంలోని కొన్ని పదాలను మార్చి స్వరాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణకు అన్వయించుకునేలా కొత్త మార్పులు చేస్తున్నారు. ఇందులో పూర్తి గీతాన్ని 13.30 నిమిషాల నిడివితో రూపొందించారు. తెలంగాణ అధికారిక కార్యక్రమాల్లో, జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా ఆలపించడానికి వీలుగా 2.30 నిమిషాల నిడివితో మరో గీతాన్ని రూపొందిస్తున్నారు. ప్రధాన గీతం ప్రాధాన్యత తగ్గకుండా అందెశ్రీ దానిని తీర్చిదిద్దారు. పల్లవితో కలుపుకొని మొత్తం 12 చరణాలతో ఈ రాష్ట్ర గీతం రాబోతుంది. అయితే ఇందులో పూర్తి గీతాన్ని 13:30 నిమిషాల నిడివితో, రాష్ట్ర అధికారిక కార్యక్రమాల్లో ఆలపించడానికి వీలుగా 2:30 నిమిషాల నిడివితో మరో దానికి స్వరకల్పన చేయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News