మన తెలంగాణ/హైదరాబాద్ : వచ్చేనెల 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు (సుమారుగా 12 రోజులు) భూపాలపల్లి జి ల్లా కాళేశ్వరంలో ‘సరస్వతీ పుష్కరాల’ను నిర్వహిస్తున్నామ ని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నా రు. ఈ పుష్కరాల కోసం ప్రభుత్వం చేపట్టిన ఏర్పాట్ల వివరా లు భక్తులకు సమగ్రంగా తెలిపేందుకు కాళేశ్వరం సరస్వతి పుష్కరాల వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఐటీ, ప్రరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం హైదరాబాద్లోని సచివాలయం లో ప్రారంభించారు. ఈ పుష్కరాలకు వచ్చే భక్తులు, యాత్రికులకు సంబంధించిన వివరాలు తెలిపేందుకు వాటిని ప్రా రంభించినట్టు మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ (ఎండోమెంట్స్) శైలజా రామయ్యర్(ఐఏఎస్), కమిషనర్ శ్రీధర్(ఐఏఎస్), ధార్మిక పరిషత్ అడ్వైయిజర్ గోవింద హరి, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఆలయ ఈఓ మహేష్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ ‘సరస్వతీ పుష్కరాలు’ పండుగకు స్నాన ఘాట్ల విస్తరణతో సహా వివిధ అభివృద్ధి పనులను విస్తృతం గా చేపట్టినట్టు మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో సరస్వతీ పుష్కరాలు నిర్వహించామని, ఇప్పుడు కూడా అవకాశం తమకు రావడం ఆ భగవంతుడి ఆశీస్సులున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
దేవాలయాల విషయంలో చాలా క్రీయాశీలకంగా పనిచేస్తున్నాం
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ తమ ప్రభుత్వం దేవాలయాల విషయంలో చాలా క్రీయాశీలకంగా పని చేస్తుందన్నారు. గత ప్రభుత్వం దేవాదాయ శాఖ సంబంధిత వ్యవహారాలను పూర్తిగా నిర్లక్ష్యం వహించిందన్నారు. తాను దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ప్రతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్టు చెప్పారు. సమ్మక్క సారక్క జాతర, కొమురవెల్లి కల్యాణం, భద్రాచలం కల్యాణం తదితర అన్నీ ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్టు వివరించారు. భక్తులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చేసినట్టు మంత్రి కొండా సురేఖ వివరించారు. యాదగిరి టెంపుల్ కు పాలక మండలి చట్ట సవరణ చేపట్టినట్టు ఆమె చెప్పారు. అయితే, ఈ సరస్వతీ పుష్కరాలకు రోజుకు 50 వేల నుంచి లక్ష దాకా వస్తారని అంచనా వేస్తున్నట్టు మంత్రి కొండా వివరించారు. అక్కడ 17 అడుగుల రాతి సరస్వతి విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. చలువ పందిళ్లు, శాశ్వత మరుగుదొడ్లు ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి కొండా చెప్పారు. వెబ్ సైట్, యాప్ ద్వారా అన్ని వివరాలు తెలియచేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చాక అమలు చేసిన ఉచిత బస్సు పథకం ద్వారా దేవాదాయ శాఖకు లాభం చేకూరినట్టు మంత్రి కొండా తెలిపారు. మహిళలు పెద్ద ఎత్తు సంఖ్య ఆలయాలకు వస్తున్నట్టు మంత్రి కొండా సురేఖ చెప్పారు.
పుష్కరాలకు వచ్చే భక్తులకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలి
పుష్కరాలకు వచ్చే భక్తులకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని మంత్రి కొండా సురేఖ అధికారులకు ఆదేశించారు. ‘ఉత్తరాన ప్రయాగ వద్ద, దక్షిణ భారతంలో కేవలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో మాత్రమే సరస్వతి నది అంతర్వాహినిగాప్రవహిస్తుందని మంత్రి కొండా తెలిపారు పవిత్ర సరస్వతీ పుష్కరస్థానం చేసిన వారికి సమస్త పాపములు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వాసిస్తారని ఆమె తెలిపారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా, శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు కలిసి త్రివేణి సంగమంగా ప్రవహిస్తున్నందున కాళేశ్వర క్షేత్రం వద్ద త్రివేణి సంగమ తీరంలో గతంలో తేదీ 30.05.2013 నుంచిడి 10.06.2013 వరకు కాళేశ్వరంలో సరస్వతీ నదికి పుష్కరాలు నిర్వహించినట్టు మంత్రి కొండా తెలిపారు. ప్రస్తుతం వచ్చేనెల 15.05.2025 నుంచి 26.05.2025 వరకు 12 రోజులు ఈ సరస్వతి నది పుష్కరాలు నిర్వహిస్తున్నామని మంత్రి కొండా తెలిపారు.
పుష్కరాలు జరిగినన్నీ రోజులు పీఠాధిపతులు పుణ్యస్నానం
సరస్వతి పుష్కరాల సందర్భంగా ప్రతి రోజు ఒక పీఠాధిపతి ఈ పుష్కర స్నానం చేయనున్నట్టు మంత్రి కొండా తెలిపారు. పుష్కర ప్రారంభం మే 15, 16వ తేదీన శ్రీ గురుమదనానంద సరస్వతి పీఠం, రంగంపేట, మెదక్ నుంచి శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామిలు పాల్గొని సరస్వతి పుష్కరాలను ప్రారంభిస్తారన్నారు. మే 17వ తేదీన తుని తపోవనం పీఠాదిపతి శ్రీ శ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి, మే18వ తేదీ, పుష్పగిరి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ అభినవోద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామి, మే 19వ తేదీన నాసిక్ త్రయంబకేశ్వర్ శ్రీ శ్రీ శ్రీ మహామండలేశ్వర్ ఆచార్య సంవిదానంద సరస్వతి మహారాజ్, మే 23వ తేదీన హంపి విరుపాక్ష పీఠాదిపతి శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామి పుష్కర స్నానం ఆచరిస్తారని మంత్రి కొండా తెలిపారు. సరస్వతి పుష్కరాల సందర్భంగా ప్రతి రోజు సుమారు 50 వేల నుంచి లక్ష వరకు భక్తులు వచ్చి పుష్కర స్నానం చేసి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిలను దర్శనం చేసుకుంటారని అంచనా వేసిందని, అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం సుమారు రూ.35 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టిందని మంత్రి కొండా తెలిపారు.