Tuesday, April 15, 2025

బ్యూటీలకు లక్కీ ఆఫర్

- Advertisement -
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది? అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా గురించి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని, వారిలో ఒక హీరోయిన్‌గా కియారా అద్వానీ నటించబోతుందని తెలుస్తోంది. బన్నీ సరసన కియారా అద్వానీ అంటే.. కాంబినేషన్ బాగుంటుంది. ఇక మరో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను తీసుకుంటారట. ఇక బన్నీ కోసం అట్లీ ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను పూర్తి చేశాడని తెలుస్తోంది. మాఫియా బ్యాక్ డ్రాప్‌లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం సాగుతుందట. ఈ సినిమా మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని. మొత్తానికి బన్నీ అట్లీ నుంచి ఓ పవర్ ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అన్నట్టు సన్ పిక్చర్స్ వారు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూట్‌ను ప్రారంభించే ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్. అట్లీ సినిమా తర్వాత బన్నీతో త్రివిక్రమ్ మూవీ ఉంటుందని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News