Tuesday, September 17, 2024

విద్యార్థి మృతికి దారి తీసిన వేధింపులు…

- Advertisement -
- Advertisement -

లక్నో: విద్యార్థిని వేధించి చున్నీ లాగడమే కాక, వెంబడించి ఆమె మృతికి కారణమైన ముగ్గురు ఆకతాయిలను పోలీస్‌లు శనివారం అరెస్టు చేశారు. అయితే ఈలోగా వారు పారిపోడానికి ప్రయత్నించడంతో పోలీస్‌లు కాల్పులు జరపడంతో వారి కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. వీరిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని అంబేద్కర్‌నగర్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం వారాహి గ్రామానికి చెందిన 17 ఏళ్ల నైన్సీపటేల్ హీరాపూర్ బజార్ లోని కాలేజీలో ఇంటర్ చదువుతోంది. శుక్రవారం కాలేజీ ముగిసిన తరువాత ఆమె సైకిల్‌పై ఇంటికి వెళ్తుండగా, నిందితులు ముగ్గురూ ఆమెను బైకులపై వెంబడించారు. వేధించడంతోపాటు ఆమె చున్నీని లాగారు. దీంతో ఆమె అదుపు తప్పింది.

వెనుక వస్తున్న మరో బైక్‌తోపాటు ఎదురుగా వచ్చిన బైక్ ఆమె సైకిల్‌ను ఢీకొట్టడంతో ఆమె రోడ్డుపైపడి తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు తెలిపారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీస్‌లు రంగం లోకి దిగి ఆదివారం ముగ్గురు నిందితులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. నిందితులు షాబాజ్, అతడి సోదరుడు అర్బాజ్, మరో నిందితుడు మహ్మద్ ఫైసల్ పారిపోడానికి ప్రయత్నించడంతో పోలీస్‌లు కాల్పులు జరిపారు. 20 ఏళ్ల వయసున్న ఈ ముగ్గురు నిందితులను ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు విద్యార్థినికి మృతికి సంబంధించిన వీడియో క్లిప్‌తోపాటు పోలీస్ కాల్పుల్లో గాయపడిన నిందితుల క్లిప్పింగ్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా విధుల్లో నిర్లక్షం వహించారన్న ఆరోపణపై హన్స్‌వార్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News