Sunday, February 23, 2025

మత్తడివాగు ప్రాజెక్ట్‌లో పడి విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

ఖానాపూర్ ః ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని వడ్డాది గ్రామానికి చెందిన ఇప్ప అక్షయ్ (21) అనే పారా మెడికల్ విద్యార్థి బుధవారం మత్తడి వాగు ప్రాజెక్ట్‌లో పడి మృతి చెందాడు. పెళ్లికి వెళ్తానని చెప్పి మంగళవారం ఇంటి నుండి బయలు దేరిన అక్షయ్ ప్రాజెక్ట్‌లో శవమై తేలాడు. వాగు కట్ట పై తన ద్విచక్ర వాహనం, చెప్పులు కనిపించడంతో అనుమానం మత్స్య కారులతో వెతికించడంతో శవమై కనిపించాడు.

Also Read: బస్సు బోల్తా..15 మందికి తీవ్ర గాయాలు

మత్స్యకారుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మత్స్యకారుల సహయంతో మృతదేహన్ని ప్రాజెక్ట్ నుండి బయటకు తీయించారు. అనంతరం కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. పోస్ట్ మార్టమ్ నిమిత్తం మృతదేహన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుకి గల కారణాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News