Sunday, February 23, 2025

గురుకుల పాఠశాలలో విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

విద్యార్థి అస్వస్తతకు గురై మృతి చెందిన సంఘటన మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్ధానికుల కథనం ప్రకారం.. మెట్ పల్లి మండలం అరపేట గ్రామానికి చెందిన అద్వైత్ పెద్దపూర్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. కాగా శుక్రవారం ఉదయం అద్వైత్ కి ఫిట్స్ వచ్చింది. వెంటనే పాఠశాల సిబ్బంది అద్వైత్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News