Sunday, September 8, 2024

ఆసియా క్రీడల్లో మెరిసిన తెలంగాణ గురుకుల విద్యార్థిని

- Advertisement -
- Advertisement -

కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న అగసర నందిని
అభినందనలు తెలిపిన మంత్రి కొప్పుల ఈశ్వర్

మన తెలంగాణ / హైదరాబాద్ : ఆసియా క్రీడల్లో తెలంగాణ గురుకుల విద్యార్థిని కాంస్య పతకం కైవసం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఆసియా క్రీడల్లో అథ్లెటిక్స్ లో పాల్గొన్న ఏకైక క్రీడాకారిణి అగసర నందిని హెప్టాథ్లాన్‌లో కాంస్య పతకాన్ని ఛేజిక్కికుంది. నందిని సంగారెడ్డి లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీ లో బిబిఎ రెండో సంవత్సరం చదువుతోంది. నార్సింగి లోని గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుకున్నది.

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఐనిస్టిట్యూషన్ సొసైటీ అథ్లెటిక్స్ అకాడమీ మొదటి బ్యాచ్ విద్యార్థిని అయిన నందిని సాధారణ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి యల్లయ్య చాయి (టీ) అమ్ముతూ తన కూతురును గురుకుల పాఠశాలలో చేర్పించారు. నందిని విద్యలో రాణిస్తూనే క్రీడా రంగంపై ఆసక్తి పెంచుకుంది. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఆసియా క్రీడలకు ఎంపికైంది. నందిని వివిధ అంతర్జాతీయ వేదికల్లో నిరంతరం తన అత్యుత్తమ ప్రదర్శనను ప్రదర్శిస్తోంది. గురుకుల విద్యార్థిని నందిని ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించడం పట్ల రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎస్‌సి కార్పొరేషన్ కార్యదర్శి రాహుల్ బొజ్జా, గురుకుల సొసైటీ కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్, గురుకుల విద్యా సంస్థల సిబ్బంది అభినందనలు తెలిపారు. తెలంగాణ గురుకుల విద్యార్థిని కాంస్య పతకం సాధించడం రాష్ట్రానికే గర్వకారణమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధిస్తారన్న ఆశా భాభవం వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News