Sunday, September 8, 2024

ఉద్యోగుల దరఖాస్తులపై జిఎడికి ఆదేశాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: జిఒ 317పై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై, పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది. స్పౌజ్, మెడికల్, పరస్పర బదిలీలు(మ్యూచువల్), కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్య, భర్త చేసుకున్న దరఖాస్తులపై కేబినెట్ సబ్ కమిటీ సానుకూల నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సబ్ కమిటీకి చేసుకున్న దరఖాస్తులను సంబంధిత శాఖల అధిపతులకు పంపించాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖ(జిఎడి) అధికారులకు సబ్ కమిటీ ఆదేశించింది.

మిగతా దరఖాస్తులను వివిధ శాఖలకు పంపి వాటిని పరిశీలించిన తర్వాత తిరిగి కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకురావాలని కమిటీ సమావేశంలో నిర్ణయించింది. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన గురువారం జిఒ 317పై ఏర్పాటైన కేబినెట్ సబ్ సమావేశమైంది. సమావేశంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను సబ్ కమిటీ ప్రకటించింది. కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రఘునందన్ రావు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి శివశంకర్, జిఎడి అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News